Monday, May 6, 2024
- Advertisement -

టీడీపీకి మరో షాక్..వైసీపీలోకి పులివెందుల సతీష్ రెడ్డి!

- Advertisement -

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్‌తో టీడీపీ దిక్కులేని పరిస్థితుల్లో ఉండగా మరోవైపు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అందులోనూ టీడీపీ ఆవిర్భావం నుండి ఉన్న కీలకనేతలు. తాజాగా కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు.

పులివెందుల వైసీపీకి కంచుకోట. 1978 నుంచి వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి విజయమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ జగన్ ఇలా అంతా పులివెందుల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. ఇక మరోవైపు వైఎస్ ఫ్యామిలీపై పోటీచేస్తూ టీడీపీ జెండాను నిలబెట్టిన వ్యక్తి సతీష్ రెడ్డి. వైఎస్‌పై రెండు సార్లు, జగన్‌పై రెండు సార్లు పోటీచేసి ఓడపోయారు. ఇక పులివెందులలో టీడీపీ పేరు చెబితే గుర్తుకొచ్చేది సతీష్ రెడ్డే.

అలాంటి వ్యక్తి సైకిల్ దిగి వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 13న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు సతీష్ రెడ్డి టీడీపీని వీడటం ఆ పార్టీకి పెద్ద షాకే. సతీష్ రెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. సతీష్ రెడ్డి చేరిక వైసీపీకి మరింత ప్లస్ కాగా ఆయన బాటలోనే మరికొంతమంది టీడీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కడప జిల్లాలో టీడీపీ మరింత వీక్ అవడం ఖాయం అనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -