- Advertisement -
టీడీపీకి వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రధాన అనుచరుడు పొతుగుంట రాజేష్ నాయుడు కాంగ్రెస్లో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల..రాజేష్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
శ్రీకాళహస్తి బోర్డు మాజీ ఛైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడు తనయుడే రాజేష్. ఇక బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి గురువయ్య అత్యంత సన్నిహితుడు. రాజేష్ నాయుడు డాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.ఆయన కాంగ్రెస్లో చేరడం టీడీపీకి గట్టి షాకే.
కాంగ్రెస్ నుండి రాజేష్ బరిలో ఉండే అవకాశం ఉంది.రాజేష్ది కమ్మ సామాజికవర్గం కాగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో మంచి పట్టు ఉంది.