Saturday, April 27, 2024
- Advertisement -

టీడీపీ అభ్యర్థులపై తమ్ముళ్ల ఫైర్..

- Advertisement -

తెలుగు దేశం అభ్యర్థులకు వ్యతిరేకంగా పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.అనకాపల్లి లో తెలుగుదేశంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టగా మాడుగులలో టీడీపీ అభ్యర్థి కి ఎన్నారై పైల ప్రసాద్‌కు నిరసన సెగ తగిలింది. టీడీపీ కార్యకర్తలే పైలాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఎన్నారై పైల ప్రసాద్ కు సీటు వద్దంటూ కార్యకర్తలు ప్రదర్శన చేశారు. నాన్ లోకల్ వద్దు లోకల్ లోపల ముద్ద అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టిడిపి అధిష్టానం సీటుపై పున పరిశీలన చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.

వాస్తవానికి ఈ టికెట్‌ కోసం ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్‌ పివిజి కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు టికెట్ ఆశీంచారు. అయితే తనకు అనుకూలంగా ఉన్న పైలాకే టికెట్ కేటాయించారు చంద్రబాబు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఏపీ జన్మభూమి రాష్ట్ర కమిటిలో కీలక బాధ్యతలు చేపట్టారు పైలా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -