ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది టీడీపీ – జనసేన ముసలం తారాస్ధాయికి చేరింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఓ కొలిక్కిరాగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ – జనసేన మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతోంది. సీటు తమకంటే తమకేనని ఇరు పార్టీల నేతలు పోటాపోటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తెనాలి సీటు వ్యవహరం టీడీపీలో ముసలం పుట్టించింది.
తెనాలి సీటును జనసేన నాదెండ్ల మనోహర్కు సీటు కన్ఫామ్ అయిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నాదెండ్లకు సీటు కేటాయిస్తే తలోదారి చూసేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేత,మాజీ మంత్రి ఆలపాటి రాజా క్యాడర్తో సమావేశం నిర్వహించారు. ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేనకు సీటు ఇస్తే సహకరించే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు.ఒకవేళ టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు ఆలపాటి రెడీ అవుతున్నారు.
ఒక్క తెనాలి విషయంలోనే 10 స్థానాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో ఒక పార్టీకి టికెట్ ఇస్తే మరొక పార్టీ సహకరించే పరిస్థితి లేదు. సో మొత్తంగా ఫస్ట్ లిస్ట్ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ – జనసేన నేతలు ఈ నియోజకవర్గాల నేతలను ఎలా బుజ్జగిస్తారో వేచిచూడాలి.