యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నాలుగైదు పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన మరో సంచలన దర్శకుడితో సినిమా చేయడానికి ఓకే చెప్పారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్లో ఉన్న ప్రభాస్.. ఇది పూర్తి అయిన వెంటనే భారతీయ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ను ఖరారు చేసినట్టు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. కాగా, సలార్ సినిమా కోసం అధికంగా కొత్త నటులను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలో ఆడిషన్స్ సైతం నిర్వహించారు.
దాదాపు 100 మంది కొత్త నటులను ఎంపిక చేశారు. వీరంత కూడా ప్రభాస్తో కలిసి నటించబోతున్నారు. దీని గురించి సినీ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి. అధికంగా కొత్త యాక్టర్లనే తీసుకోవడం ఇందుకు కారణం. అలాగే, సీనియర్ తారగణం కూడా మంచి గుర్తింపు ఉన్న వారు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
వెనక్కి తగ్గిన వరుణ్ తేజ్..గనికి అసలు ఏం జరిగింది?