టాలీవుడ్ లో హీరో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. ఆ తర్వాత చాలా తక్కువ టైంలోనే భారీ క్రేజ్ సంపాధించుకుంది. వరుస ఆఫర్స్ ఆర్తికి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఆ క్రేజ్ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. హీరోలతో అఫైర్ మరియు ఇతరత్ర కారణాల వల్ల ఈ అమ్మడు అవకాశాలు కోల్పోయింది. దాంతో పెళ్లి చేసుకోవాలని అని అనుకుంది. పెళ్లి అయిన కొన్నాళ్లకే భర్తతో ఆర్తి విడాకులు తీసుకుంది.
అందుకు కారణం ఆర్థిక అంశాలే అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆర్తి అగర్వాల్ డబ్బులు బానే సంపాధించింది. ఆ డబ్బును తల్లిదండ్రులు మరియు చెల్లెలు పేరుతో ఆస్తులు కొనుగోలు చేసింది. ఆ ఆస్తులను ఆర్తి అగర్వాల్ భర్త తీసుకు రావాల్సిందిగా డిమాండ్ చేశాడట. అయితే ఆ ఆస్తులు అతనికి ఇచ్చేందుకు ఆర్తి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట. దాంతో ఆర్తి నుంచి ఆమె భర్త విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆస్తుల విషయంలో ఆమె కుటుంబ సభ్యులతో విభేదించింది.
మళ్లీ హీరోయిన్ అయ్యి డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేసింది. అయితే లావు ఎక్కువ అవ్వడంతో పాటు, మునుపటి అందం లేక పోవడంతో ఆర్తి అగర్వాల్కు అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఆ కారణంగానే అందంగా కనిపించాలని లైపో చేయించుకుంది. లైపో ఆపరేషన్ వికటించడం వల్లే ఆర్తి అగర్వాల్ మృతి చెందింది. ఆర్తి అగర్వాల్ మృతి చెందడానికి పరోక్షంగా ఆమె కుటుంబ సభ్యులు కారణమని ఇప్పుడు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
సోనియా అగర్వాల్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?
సీఎం జగన్ అనుకరిస్తూ స్కిట్.. ఫైర్ అయిన వైసీపీ ఫ్యాన్స్..!