కొనిదల ప్రొడక్షన్స్ , మైత్రి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలు.
సినిమా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆచార్య మూవీని ఫిబ్రవరి 4న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈ సినిమాను రీషూట్ చేయాలని అనుకుంటున్నారని ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. రీషూట్ చేయమని స్వయంగా చిరంజీవే దర్శకుడికి సూచించారట.
ఇందుకు కారణం ఇటీవల విడుదలైన బాలయ్య సినిమా అఖండనే అని సమాచారం. అఖండలో బోయపాటి శ్రీను బాలయ్యను చాలా క్లైమాక్స్ హైప్లో చూపించారు. ఆచార్య సినిమాలో హీరో క్యారెక్టర్ క్లైమాక్స్లో అంత స్థాయిలో రాలేదని.. అందుకే తిరిగి కొంత కాలం రీషూట్ చేయనున్నారట. దీంతో ఒక నెల రోజులైనా సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాగా ఆచార్య సినిమా యూనిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ఫిబ్రవరి 4న విడులద చేస్తామని, సంక్రాంతి బరిలో చిరు సినిమా లేకపోతే ఎలా అని చెబుతున్నారు.