విశాల్ కి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘పందెంకోడి’. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. అయితే మళ్లీ చాలా కాలం తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించాలని అన్నీ ప్లాన్ చేసుకున్నారు.
ఈ చిత్రాన్ని తమిళంలో ‘శాందాకోడి -2’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది. అసలు విషయంలోకి వస్తే విశాల్ తన ట్విట్టర్ లో ఈ విధంగా షేర్ చేశాడు. ప్రాజెక్టులపై కమిట్మెంట్ లేని దర్శకులు మన దగ్గర ఉన్నారు. యాక్టర్లు యాక్టింగ్కు, దర్శకులు దర్శకత్వం పై మాత్రమే పరిమితం అయితే బాగుంటుందని విశాల్ ట్వీట్ చేశాడు.ఈ మాటని ఇన్డైరెక్టుగా లింగుస్వామిని అన్నాడు. అల్లు అర్జున్తో సినిమా తెరకెక్కించే అవకాశం రావడంతో లింగుస్వామి విశాల్ ‘శాందాకోడి -2’ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో విశాల్ ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం.