Friday, March 29, 2024
- Advertisement -

మరో ప్రేమ కథలో అఖిల్..!

- Advertisement -

అక్కినేని వారసుడు అఖిల్.. హీరోగా పరిచయమై ఆరేళ్లు పూర్తయింది. కానీ ఇంతవరకూ ఆయనకు సాలిడ్ హిట్ పడలేదు. నిజానికి అఖిల్ సినిమాల్లోకి రాకముందు ఆయన పై అక్కినేని అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. సినిమాల్లోకి వస్తే పెద్ద స్టార్ అవుతారని అంతా భావించారు. కానీ అఖిల్ కెరీర్ అంతా అనుకున్నట్లు సాగడం లేదు. 2015 లో అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమా అఖిల్ విడుదల అయ్యింది. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

ఆ తర్వాత అఖిల్ చేసిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను అల్లు అరవింద్, బన్నీవాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే మధ్య లవ్ ట్రాక్ బాగా వచ్చిందని సమాచారం. ఇద్దరి మధ్య రొమాన్స్ సన్నివేశాలు బాగా కుదిరాయని అంటున్నారు. ఈ సారి అఖిల్ కు హిట్ పక్కా అంటున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్ : అలియాభట్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..!

ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా తర్వాత అఖిల్ మరో ప్రేమకథలో నటించనున్నాడు. ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కథ మాత్రం బాగా కుదిరినట్లు సమాచారం.

Also Read: విజయ్​ సేతుపతి వదులుకున్న పాత్రకు చైతూకి.. వర్కవుట్​ అవుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -