అక్కినేని ఫ్యామిలీలో జరగాల్సిన అఖిల్, శ్రియల పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం పై సోషల్ మీడ్యాలో ఓ రెంజ్ లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా స్పందించినది లేదు. ప్రస్తుతం నాగ్.. అఖిల్, శ్రియాల మధ్య రాజీ కుదిర్చేందుకు ట్రై చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మరో వైపు అఖిల్ మాత్రం పెళ్లి చేసుకోను అంటున్నాడట. శ్రియా తరపు వాళ్లు అఖిల్ ప్రవర్తన వల్ల పెళ్లి ఆగిపోయిందని అంటుంటే మరో వైపు అఖిల్ మాత్రం.. శ్రియా అహంకారం మరియు పొగరుబోతు తనం వల్ల పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అంటున్నాడట. అఖిల్ బహిరంగంగా పెళ్లి క్యాన్సిల్ పై ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడైన ఒక కమెడియన్తో అఖిల్ తన పెళ్లి క్యాన్సిల్ విషయమై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆ టైంలో శ్రియపై అఖిల్ దారుణమైన కామెంట్స్ చేశాడట.
శ్రియా డబ్బుందనే అహంకారం, చదువుకున్నాననే పొగరు ఎక్కువ ఉంటుందని, పెద్ద వారిని కూడా గౌరవించదు అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడట. తన కుటుంబంలో తనకు అత్యంత ఆప్తురాలైన ఒక వ్యక్తి గురించి శ్రియా తప్పుగా మాట్లాడటం వల్ల ఆమెపై కోపం, అసహ్యం మొదలైందని, ఇంకా పలు సందర్బాల్లో ఆమె పొగరుబోతు తనంను ప్రదర్శిస్తూ వచ్చిందని, అందుకే జీవితాంతం ఆమెను భరించడం తన వల్ల కాదని, అందుకే ఆమెతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట.
{youtube}_i_h_UguFx0{/youtube}
Related