అక్కినేని నవమన్మథుడు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్తలు తెలుగు మీడియాలోను, సోషల్ మీడియాలోను జోరుగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ వెనక మరో హాట్ మ్యాటర్ బయటకు వచ్చింది. ముందుగా.. టి.సుబ్బరామి రెడ్డి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో శ్రియాకు, అఖిల్ కు మధ్య గొడవ అయిందని, అలాగే ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరి మధ్య గొడవ అయిందని వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పుడు అఖిల్ ఒకరిద్దరితో ఎఫైర్స్ నడపడం… అది శ్రియా కంట్లో పడడం వల్లే అఖిల్తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అఖిల్ ఓ ఫేమస్ బాడ్మింటన్ క్రీడాకారిణితో సన్నిహితంగా ఉండడం వల్లే శ్రియా భూపాల్ ఫ్యామిలీ మ్యారేజీ రద్దు చేసిందని రూమర్లు వినిపిస్తున్నాయి. అఖిల్ ఆ బాడ్మింటన్ ప్లేయర్ తో కలిసి పబ్బులు, పార్టీలంటూ తిరగడం తెలిసి శ్రియా భూపాల్ అఖిల్ను నిలదీసిందట. ఈ మ్యాటర్ను అఖిల్ చాలా లైట్ తీసుకున్నాడట. ఫీలయిన శ్రియా ఫ్యామిలీ పెళ్లి క్యాన్సిల్ చేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి అఖిల్ పెళ్లి క్యాన్సిల్ వెనక ఇంకెన్ని గాసిప్స్ వస్తాయో చూడాలి.
{youtube}SfdSibMH1hQ{/youtube}
Related