అఖిల్ తన సినిమాల్లో హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లే కావాలని పట్టుబడుతున్నాడట. అలా అయితేనే సినిమాకి అదనపు ఆకర్షణ చేకూరుతుందని.. తద్వారా సినిమాకి హైప్ వస్తుందని అఖిల్ భావిస్తున్నాడట. హీరోగా అఖిల్ ప్రూవ్ చేసుకున్నాడు.
అయితే తాను ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అందుకే అఖిల్ ఇప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ‘గీతా ఆర్ట్స్’ సంస్థలో రూపొందుతోంది కాబట్టి.. కచ్చితంగా ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక దీని తరువాత అఖిల్.. సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.’ఏ.కె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ గా రష్మికను తీసుకోమని అఖిల్ సూచించాడట. ఇదే బ్యానర్లో ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సూపర్ హిట్ చిత్రం చేసింది. దాంతో ఆమెను నిర్మాత సంప్రదించగా.. ఓకే చెప్పేసిందనట్టు టాక్ వినిపిస్తుంది. రష్మికది గోల్డేన్ లెగ్ అని.. అఖిల్ తో ఆమె చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు.
షాకింగ్ : బిగ్బాస్ నుంచి గంగవ్వ బయటకు.. ఎందుకంటే ?
ప్రభాస్ కు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?