అక్కినేని ప్రిన్స్ అఖిల్.. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ త్వరలో కావాల్సిన ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యినట్లు తెలుస్తోంది. తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించిన అఖిల్ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి వరకు వెళ్లాడు. ఇప్పుడు పెళ్లి వద్దంటూ అఖిల్ మొండికేశాడట. దాంతో ఇరు ఫ్యామిలీలు కూర్చుని మాట్లాడుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాయి. ఇక తాజాగా సినిమాల విషయంలో కూడా అఖిల్ చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
అఖిల్ మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే. దాంతో రెండవ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కాని అలా కాకుండా అఖిల్ మళ్లీ ఫ్లాప్ అయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అక్కినేని అఖిల్ నటించిన సినిమా లో హీరోయిన్ గా సయేషా సైగల్ నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో మళ్లీ ఆ భామకు అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో ఒకటి రెండు చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మతో మళ్లీ అఖిల్ రొమాన్స్ చేయాలని కోరుకుంటున్నాడు.
విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున నిర్మిస్తున్న అఖిల్ రెండవ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఈ క్రమంలో అఖిల్ సరసన హీరోయిన్స్ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు దర్శకుడు. విక్రమ్ కుమార్ ను ఒప్పించి మరీ ఈ మూవీలో ఒక హీరోయిన్ గా సయేషా సైగల్ ను అఖిల్ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా మేఘ ఆకాష్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ నిర్ణయంపై సినీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అఖిల్ మైండ్ లేని పనులు చేస్తున్నాడంటూ ఆరోపణలు జోరుగా గుప్పిస్తున్నారు. మరి ఈ విషయంపై నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఏది ఏమైనా.. అఖిల్ వల్ల నాగ్ కి పెద్ద సమస్యలు వచ్చి పడుతున్నాయి.
{youtube}56hZsmjzowE{/youtube}
Related