Friday, May 3, 2024
- Advertisement -

ప్రభాస్ మార్కెట్ ను పెంచడానికి అలాంటి పుకార్లు పుట్టిస్తున్నారా!

- Advertisement -

ప్రభాస్ కెరీర్ ను బాహుబలి సినిమాకు ముందు.. తర్వాత.. అన్నట్టుగా విభజించుకోవచ్చు. ఆసినిమాలు నటించడంతో ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. వందల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టిన సినిమాలో హీరోగా అతడు ఒక వెలుగు వెలిగాడు. ప్రధానమంత్రితో మీటింగ్ అయ్యేంత వరకూ వెళ్లింది వ్యవహారం.

ఇక బాహుబలి విడుదల తర్వాత ప్రభాస్ సెలబ్రిటీ స్టేటస్ కూడా చాలా వరకూ పెరిగింది. ప్రభాస్ ను కొన్ని సంస్థలు బ్రాండ్ అంబాసిడర్స్ గా నియమించుకోబోతున్నాయని.. ప్రభాస్ క్రేజ్ ను అవి అలా క్యాష్ చేసుకోబోతున్నాయని  ప్రచారం జరిగింది.

అన్నింటి కన్నా విశేషం ఏమిటంటే.. బాహుబలిలో ప్రభాస్ ను చూసి బాలీవుడ్ ఆశ్చర్యపోయిందని.. ఆయనతో సినిమాలు చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది, ఒక దశలో ప్రభాస్ దూమ్ -4 లో నటించబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. ధూమ్ సీరిస్ లో ఇది వరకూ హృతిక్ రోషన్ , అమిర్ ఖాన్ లు చేసిన విలన్ తరహా వేషాన్ని ప్రభాస్ వేయబోతున్నాడని ప్రచారం చేశారు. ఇది విని ఔరా అనుకున్నారంతా!

అయితే అది ఉత్తుత్తి పుకారే అని ఇప్పుడు స్పష్టం అవుతోంది. యాశ్ రాజ్ పిక్చర్స్ వాళ్లకు ఇప్పుడు ధూమ్ ఫోర్ ఆలోచన ఏదీ లేదట, ప్రభాస్ తో ఆ సినిమా చేసే ఆలోచన అస్సలు లేదట! మరి ఆ వార్త ఎలా వచ్చింది అంటే.. కొంతమంది సృజనాత్మకంగా అలాంటి పుకార్లను పుట్టించినట్టుగా తెలుస్తోంది.

ప్రభాస్ రేంజ్ ను పెంచే ప్రయత్నంలో అలా చేశారని తెలుస్తోంది. మరి ఇలాంటి పుకార్లతో పెరిగే ఇమేజ్ ఎంత సేపు ఉంటుంది? అసలు విషయం బయటపడ్డాకా.. సదరు సెలబ్రిటీల స్టేటస్ కు కూడా వీటి వల్ల నష్టం జరుగుతుంది కదా! హైప్ ను పెంచడానికి పుకార్లను పుట్టించే వాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -