ఇప్పుడు వస్తున్న సినిమాలో బూతు డైలాగులు ఉండటం సర్వసాధారణం అయిపోయింది. ఆడియెన్స్ కూడా వీటికి అలవాటు పడిపోతున్నారు. దాంతో ఈ డబుల్ మీనింగ్ డైలాగులు డోస్ పెంచేశారు దర్శకనిర్మాతలు. కామెడీని బాగా పండించడం కోసం ‘బూతు’ని తెగ వాడేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన డీజే సినిమాలోనూ.. అలాంటి డైలాగ్స్ బాగానే పేలాయి.
{loadmodule mod_custom,GA1}
ముఖ్యంగా.. అల్లు అర్జున్ బన్నీ చెప్పిన ఓ డైలాగ్ అయితే థియేటర్లలో మోత మోగించేయడంతో, అది బాగా పాపులర్ అయ్యింది. పూర్తి విషయంలోకి వెళ్తే.. ఓ సీన్ లో డీజేని కలిసేందుకు హీరోయిన్ పూజా హెగ్డే వెళ్తోంది. అయితే అక్కడ మరో అమ్మాయితో డీజే సెల్ఫీ దిగుతుంటాడు. అది చూసి.. తీవ్ర ఆగ్రహావేశానికి గురైన పూజా.. వెంటనే డీజే దగ్గరికి వెళ్లి ‘ఏంటిది’ అని గట్టిగా ప్రశ్నిస్తోంది. అప్పుడు డీజే.. ‘ఎన్నాళ్లని సింగిల్గా సెల్ఫీ కొట్టుకుంటాను’ అని జవాబిస్తాడు. అప్పుడు అల్లు అర్జున్ చేసే చేష్టలు కూడా చాలా వెటకారంగా కనిపిస్తాయి. ఆ డైలాగ్లో అల్లు అర్జున్ ‘కొట్టుకుంటాను’ అనే మాటకంటే ‘తీసుకుంటాను’ అని వాడివుంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ.. ‘కొట్టుకుంటాను’ అని చెప్పడంతో అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పైగా.. బన్నీలాంటి స్టార్ హీరో అలాంటి డైలాగ్ చెప్పడం పెద్ద చర్చనీయాంశమైయింది. ఇలాంటి డైలాగ్ లు సినిమాలో బానే ఉన్నాయి. ఇలాంటి సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
{loadmodule mod_custom,GA2}
రిలీజ్ కు ముందే.. ‘నమకం, చమకం’ వంటి పదాలతో కాస్త వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇక సినిమాలో ఓ సీన్ లో హీరోయిన్ పూజా హెగ్డే స్విమ్మింగ్ పూల్ నుంచి బికినీతో బయటకు వస్తున్న వీడియోని నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. అయితే యూత్ ఆడియన్స్ను ఆకట్టుకోవడానికి మరీ ఇంత బోల్డ్గా చూపిస్తారా అంటూ కొంతమంది మండిపడుతున్నారు.
{youtube}PAdbCMbURb4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related