Saturday, May 11, 2024
- Advertisement -

అల్లు అర్జున్‌కి చిరంజీవి వార్నింగ్?

- Advertisement -

అల్లు అర్జున్ సరైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పను బ్రదర్ అని అనేశాడు. దీతో అగ్రహం చెందిన పవన్ ఫ్యాన్స్ బన్నీ పై కోపం తెచ్చుకున్నారు. అయితే ఈ చెప్పను బ్రదర్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అందుకు బిన్నంగానే పవన్ ఫ్యాన్స్ బన్నీ పై కౌంటర్ వేస్తున్నారు.

చూసుకుంటాం బ్రదర్ అని బన్నీకి ఆపోజిట్ గా పోస్టులు రాయడం తో మొదలై చివరికి ఫ్యాన్ వార్ కి దారి తీసింది.. ఇప్పుడు ‘చెప్పను బ్రదర్’, ‘చూసుకుంటాం బ్రదర్’ ఈ రెండు హాట్ టాపిక్ అయ్యాయి. అక్కడితో మెగా ఫ్యాన్స్ కుటుంబంలో చీలికలు వచ్చి కొంతమంది అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పాంప్లెంట్స్ కూడా ప్రచురించి మరీ ప్రచారం చేస్తున్నారట. దాంతో ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లిందట. దీంతో బన్నీ కి చిరంజీవి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.

ఫ్యాన్స్ ని అనందపరచం వంటివి చేయాలి తప్ప వాళ్ళు కోపం తెచ్చుకునే లా చేయకుడదు అని చెప్పాడట. ఫ్యాన్స్ విషయంలో చాలా ఓపిక అవసరం అని కూడా చెప్పాడట. ఇంటికి లంచ్ కి రమ్మని ఆహ్వానించిన చిరు ఫ్యాన్స్ విషయంలో ఎలా ఉండాలో వివరించారట. వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏమి చేయలేమని పైగా ఇప్పుడు మనమంతా ఈ స్టేజ్ లో ఉన్నామంటే అది ఫ్యాన్స్ చలవే అని హితవు పలికారట. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయొద్దు అని బన్నీకి చిరు చెప్పారట. అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారిలో ఎవరో ఒకరు ఇదే విషయంపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -