సూరేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ నటించిన ధృవ సినిమా మంచి విజయం సాధించింది. చాలా రోజులుగా మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న చరణ్ కి ఈ సినిమా మంచి సక్సెస్ ని అందించింది. దాంతో చరణ్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు.
ఇప్పుడు చరణ్ తన తదుపరి సినిమాకి రెడీ కాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేబుతున్నాడు చరణ్. ఈ సినిమాని సంక్రాంతి తర్వాత మొదలు పెట్టనున్నాడు..పక్క పల్లెటూరు నేపథ్యం లో సాగే ప్రేమ కథ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా రాశీ కన్నా, సమంత, అనుపమ పేర్లు వినిపించగా తాజాగా ఆ లిస్ట్ లో అమలాపాల్ పేరు వచ్చి చేరింది.
డైరెక్టర్ విజయ్ తో విడాకులు తీసుకున్న అమలాపాల్ , ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ గా మారిపోయింది..ఈ నేపథ్యం లో సుకుమార్ – చరణ్ మూవీ లోని హీరోయిన్ కోసం ఆమెను ఆడిషన్ రమ్మని పిలిచారట..ఒకవేళ ఆడిషన్ లో ఒకే అయితే ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట చిత్ర యూనిట్. ప్రస్తుతం చరణ్ చిరు 150 మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు..ఈ మూవీ రిలీజ్ కాగానే సుక్కు మూవీ ని సెట్స్ ఫైకి తీసుకరాబోతున్నాడు..ఈ మూవీ ని మైత్రి మూవీస్ వారు నిర్మించబోతున్నారు.
Related