ఏ పరిశ్రమలో అయిన తమ హీరోనే గొప్ప అని చెప్పుకుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్లో యంగ్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇలాంటి వారే నడుస్తోంది. రీసెంట్ గా ధృవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ రికార్డును క్రాస్ చేశాడు. 2012లో ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా ఓవర్సీస్లో సాధించిన రికార్డును చెర్రీ ధృవతో బ్రేక్ చేశారు.
నాలుగున్నర సంవత్సరాల క్రితమే బాద్ షా సినిమా ఓవర్సీస్లో 1.28 మిలియన్ డాలర్లను కలెక్ట్ చెయ్యగా, ఇప్పుడు ధృవ 1.29 మిలియన్ డాలర్స్ వసూలు చెయ్యడంతో యంగ్ టైగర్ రికార్డ్ ను చరణ్ బ్రేక్ చేసినట్లయ్యింది. మరో విశేషం ఏంటంటే చెర్రీకి ఓవర్సీస్లో ఇదే తొలి మిలియన్ మార్క్ సినిమా. ఈ రికార్డును చెర్రీ అభిమానులు ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ రికార్డు బీట్ చేసిన చెర్రీ అని పోస్టులు పెడుతున్నారు.
ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు కౌంటర్ ఎటాక్ చేస్తూ జోకులు వేసుకుంటున్నారు. అపట్లో వచ్చిన ఈ బాద్ షా సినిమా రికార్డును బ్రేక్ చేయడానికే చెర్రీకి ఇన్ని సంవత్సరాలు పడితే ఇక టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాల రికార్డులు బ్రేక్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మీ చరణ్ కి అని ఎన్టీఆర్ అభిమానులు చరణ్ రికార్డుపై జోకులు వేసుకుంటున్నారు.
Related