Friday, April 19, 2024
- Advertisement -

ఈ పాత్ర సినిమాకే చాలా కీలకంట!

- Advertisement -

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. పూరి కూడా ఈ సారి ఎలాగైన బిగ్ హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో సూమారుగా 15 నిమిషాల నిడివి గల ఒక పాత్ర ఉంది. ఈ పాత్ర సినిమాకే చాలా కీలకంట.

అయితే ఈ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్న సమయంలో పూరికి వేంటనే ఈ పాత్ర బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేస్తే చాలా బాగుంటుందని అమితాబ్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నాడట. గతంలో పూరి అమితాబ్ తో బుడ్డా హో గయా తేరా బాప్ అనే చిత్రాన్ని తెరకేక్కించారు.

వారి ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో పూరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూరి అడిగితే అమితాబ్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగానే అమితాబ్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ రావడం ఖాయం. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు  త్వరల్లోనే బయటకు రానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -