బుల్లితెరపై హాట్ యాంకర్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. క్షణం సినిమాతో వెండితెరకు పరిచమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చకుంది. ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి అందరి మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ థ్యాంక్ యూ బ్రదర్ సినిమాలో నటిసస్తుంది. వీటితో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ, రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లోనూ కీలక పాత్రలో నటిసస్తుంది.
ఇలా వరుస సినిమాలతో జోరు మీదున్న అనసూయ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్లోనూ తళుక్కున మెరుస్తుంది. మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన విన్నర్ చిత్రంలో ఈమె ఐటెం సాంగ్ చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా ఈమె మరో సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి కూడా రెడీ అయ్యిందట.
ఆర్.ఎక్స్.100 హీరో కార్తికేయ నటిస్తున్న చావు బ్రతుకు చల్లగా చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ ఒకటి ఉందట. 3 నిమిషాల నిడివి ఉండే ఈ సాంగ్ కోసం అనసూయ అక్షరాలా రూ .20 లక్షలు డిమాండ్ చేసిందట. అనసూయ డిమాండ్కు చిత్ర బృందం వెంటనే ఓకే చెసినట్లు సమాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ షూట్ను త్వరలోనే హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
యువ హీరోతో లిప్లాక్కు రెడీ అయిన భామ..?
ఆరోగ్య సూత్రాలు నచ్చాయ్.. పెళ్లి చేసుకుందాం అంటూ 14 లక్షలకు టోపీ!
ఆ స్టార్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న’కార్తీకదీపం’ సౌందర్య!