Friday, April 26, 2024
- Advertisement -

యాంకర్ ప్రదీప్‌ అరోగ్యంకు ఏమైంది ?

- Advertisement -

యాంకర్ ప్రదీప్ సడెన్ గా బుల్లితెరపై కనిపించడం లేదు. ఆయన కొన్ని రోజులుగా ఏ షో కూడా చేయడం లేదు. అంతేకాకుండా ఎంతో ఇష్టంగా చేసే ఢీ షో నుంచి కూడా వెళ్లిపోయాడు. దాంతో అసలు ప్రదీప్ ఎక్కడ ఉన్నాడు అని కంగారు పడుతున్నారు అతని అభిమానులు. అయితే రెమ్యునరేషన్ ఎక్కువగా అడగటం వల్లే ఢీ నుంచి తీసేశారని ప్రచారం జరిగింది. అందుకే అతని స్థానంలోకి సుధీర్, రష్మీలను యాంకర్స్ గా మార్చి.. రవి, వర్షిణిని టీం లీడర్లుగా చేశారు.

అయితే అసలు కారణం అది కాదని తెలుస్తోంది. ప్రదీప్ ఢీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అనారోగ్యం అని తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. కానీ రవి కారణంగా ఇది బయటకు వచ్చింది. ఆక్టోబర్ 23న ప్రదీప్ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా యాంకర్స్ అంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రదీప్ చేయాల్సిన ఢీలోకి రవి రావడానికి కారణం కూడా బయటకు వచ్చింది. ప్రదీప్ పుట్టినరోజు నాడు అతడితో మాట్లాడనని ఓ వీడియో చేశాడు రవి. అంతేకాకుండా అతడు రికవర్ అవుతున్నాడు.

త్వరలోనే మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తాడు అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ప్రదీప్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి అనారోగ్యం వచ్చిందనేది తెలియడం లేదు. అందుకే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ప్రోగ్రాంకు కూడా బ్రేక్ పడుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మళ్లి బుల్లితెరపై ప్రదీప్ రచ్చ చేయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -