బాహుబలి మూవీ ఎలాంటి రికార్డులను సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి-ది కంక్లూజన్ రిలీజ్ కానుంది. ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించారు.
ఈ సినిమా కోసం అనుష్క ఎంత కష్టపడినా రాజమౌళి స్పీడును అందుకోలేకపోయింది. విషయంలోకి వెళ్తే.. సైజ్ జీరో మూవీ కోసం అనుష్క ఒళ్లు పెంచిన.. ఆ తర్వాత ఒళ్లు తగ్గించడం కష్టంతో కూడుకున్న పనిగా మారింది. దీంతో అనుష్క వల్ల బాహుబలి సినీ నిర్మాతలకు ఏకంగా రూ.20కోట్ల నష్టం ఏర్పడిందని తెలుస్తోంది. బాహుబలి -1 షూటింగ్ టైంలోనే బాహుబలి-2కు సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేసారు. రెండేళ్ల క్రితం అనుష్క స్లిమ్గా ఉన్నది. కానీ స్వీటీ సైజ్ జీరో కోసం ఒళ్లు పెంచేసింది.
బొద్దుగా తయారైంది. దీంతో, అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలకు, ఇప్పుడు తీసిన సన్నివేశాలకు చాలా తేడా వచ్చింది. కొన్ని సన్నివేశాల్లో సన్నగా.. కొన్ని సన్నివేశాల్లో లావుగా కనపడటంతో.. ఆమెకు సంబంధించిన మొత్తం భాగాన్ని రీషూట్ చేయాల్సి వచ్చిందట. దీంతో, నిర్మాతలకు అదనంగా రూ. 20 కోట్లు ఖర్చయిందని సమాచారం. బాహుబలిలో అనుష్కది ముఖ్య పాత్ర కావడం వల్ల ఆమె కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సైతం వెనుకాడలేదని తెలుస్తోంది.
{youtube}k3W92B8_7Z0{/youtube}
Related