దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి-2’ రిలీజ్ అయ్యాక ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంపై కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది హీరోల పేరు బయటకు వచ్చాయి. అవన్ని రూమర్స్ అని తెలిపోయింది. జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ తీయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని వార్తలొచ్చాయి.
అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీయదు కానీ.. ఇప్పుడు తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. జక్కన్న తన తర్వాత మూవీ ఎన్టీఆర్తోనే చేయబోతున్నాడని, అందుకు సంబంధించిన ప్లాన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది మహాభారతమా? లేక మరే ఇతర కథతో తెరకెక్కిస్తున్నాడా అన్నది క్లారిటీ లేదు కానీ, తారక్తో మాత్రం చేయడం పక్కా అంటున్నారు సినీవిశ్లేషకులు.
నిజానికి.. ‘యమదొంగ’ తీసిన తర్వాత ఎన్టీఆర్ తో జక్కన్న సినిమా తీయాల్సి ఉంది. కానీ తమతమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. రాజమౌళి ‘బాహుబలి’కే ఐదేళ్లపాటు సమయంను ఇచ్చారు. తారక్ ఇతర కమిట్మెంట్స్ చూసుకున్నాడు. ఇప్పుడు ‘బాహుబలి’ కంప్లీట్ అవ్వడంతో తారక్-జక్కన్న కలిసి ఓ మూవీ చేయాలని చూస్తున్నారు. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే.. అసలు ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Related