ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలలో.. యంగ్టైగర్ ఎన్టీఆర్ మంచి జోష్తో దూసుకెళ్తున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి వరస హిట్స్ తో టాప్ ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన సోదరుడు కళ్యాణ్రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చిత్రంలో నటిస్తాడని ఈ చిత్రంకు పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే ఎన్టీఆర్ నటన చూసి ఓ సీనియర్ హీరోయిన్ కంట తడి పెట్టుకున్నారట. ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం భార్య, సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం. గతంలో ఎన్టీఆర్, సుహసిని ఇద్దరూ కలిసి కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రాఖీ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్షన్ అదుర్స్ అనిపించింది. రాఖీ సినిమా క్లైమాక్స్ లో కోర్టులో ఉండే సన్నివేశం ఎవ్వరూ మర్చిపోరు.
ఆ క్లైమాక్స్ సీన్లో ఎన్టీఆర్ నటన, ఆయన చెప్పే డైలాగులు చాలామంది మనస్సులను టచ్ చేశాయి. ఆ సన్నివేశం చూసి కంటతడిపెట్టని వారు లేరు. ఇక ఈ చిత్రంలో తారక్ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్గా సుహాసిని నటించిన కూడా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్, నటన చూసి అక్కడే ఏడ్చేసిందట. ఈ సంగతిని ఇటివలే ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Related