Sunday, May 12, 2024
- Advertisement -

షకలక శంకర్ కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య

- Advertisement -

‘జబర్దస్త్’ షో ద్వారా మంచి కమెడియన్ గా షకలక శంకర్ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ సినిమాల్లో కమెడియన్ గా బాగా ఫాపులర్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాలతో ఈ కమెడియన్ చాలా బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కొందరు కమెడియన్ షకలక శంకర్ పై ఫైర్ అవుతున్నారు.

‘పైసా వసూల్’ సినిమా టీజర్ వచ్చిన దగ్గర నుంచి అందులోని డైలగులు బాగా పాపులర్ అవుతున్నాయ్. ‘అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ విని బాలకృష్ణ అభిమానులు ఇప్పటికే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికితోడు అప్పుడే నెట్లో చాలామంది ప్యారడీలుగా కూడా ఈ డైలాగులను వాడేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే.. ఈ డైలాగును తమ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ‘ఆనందో బ్రహ్మ’ టీమ్ కూడా వాడుకుంటోంది.

ఈ మూవీ కొత్త ప్రోమోలో అన్నా రెండు బాల్కని టిక్కెట్లు కావాలి ఆనందో బ్రహ్మ సినిమా చూడాలి అంటూ షకలక శంకర్ వాయిస్ వస్తోంది. దీనితో బాలకృష్ణ డైలాగును షకలక శంకర్ పేరడీ చేయడం ఏంటి అంటూ బాలయ్య అభిమానులు షకలక శంకర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై బాలయ్య కూడా షకలక శంకర్ పై చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -