‘బాహుబలి’ మూవీ గురించి తెలుగు ప్రేక్షకులు అయిదు సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే.. తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకోవడం.. ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాక మరింత మాట్లాడుకుంటున్నారు. రెండవ పార్ట్ ఎలా ఉంటుంది.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నల గురించి తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంకా మరికొందరు సినిమాలో ప్రతి అంశంను గమనించి.. వాటి వెనక దాగి ఉన్న రహస్యలను తెలుసుకుంటున్నారు.
ఇప్పుడు ఈ సినిమాలో భళ్లాలదేవుడి భార్య గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో భళ్లాల దేవుడికి కొడుకుగా అడవి శేషు నటించిన సంగతి తెలిసిందే. కొడుకు ఉన్నప్పుడు భార్య కూడా తప్పనిసరిగా ఉండాలి. మరి భళ్లాల దేవుడి భార్య ఎవరై ఉంటారా అంటూ మొదటి పార్ట్ విడుదలైనప్పటి నుండి కూడా చర్చ జరుగుతూనే ఉంది.
ఈ సినిమా షూటింగ్ టైంలో శ్రియ, లావణ్య త్రిపాఠిలు నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు పుకార్లే అని తేలిపోయింది. తాజాగా ‘పెళ్లి చూపులు’ ఫేం రీతూ వర్మ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఒక ఫొటో కూడా విడుదలైంది. అయితే ఆ వార్తలను మాత్రం బాహుబలి టీం కొట్టి పారేయలేదు. దాంతో రానాకు భార్యగా రీతూ వర్మ నటించి ఉంటుందని, అయితే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
{loadmodule mod_sp_social,Follow Us}
Related