టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవీ వారసులుగా దూసుకుపోతున్న హీరోల్లో.. అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా అల్లు అర్జున్ ఫ్లాప్ అనేదే లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం బన్నీ డీజే- దువ్వాడ జగన్నాధం మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘నా పేరు సూర్య’ అనే సినిమా చేయబోతున్నాడు. ఏప్రిల్ 8న పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న నా పేరు సూర్య.. మే చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. డీజే రిలీజ్ తర్వాత.. వక్కంతం వంశీ సినిమా మొదలు చేయనున్నాడు అల్లు అర్జున్. దేశభక్తి కాన్సెప్ట్ తో తో సాగే ఈ సినిమాలో.. ఓ కీలకమైన రోల్ ఉంటుందిట.
కేమియోకి కాసింత ఎక్కువగాను.. గెస్ట్ రోల్ కు కాస్త తక్కువగాను ఉండే ఈ పాత్ర.. సినిమాలో చాలా కీలకమైన ప్లేస్ లో రానుందని తెలుస్తోంది. అందుకే ఈ కేరక్టర్ ను మెగాస్టార్ చిరంజీవితో చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. మెగాస్టార్ ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా.. దానికి వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. ఇప్పటికే ఈ రోల్ విషయంలో బన్నీ నుంచి చిరంజీవికి ప్రపోజల్ అండ్ రిక్వెస్ట్ లు వెళ్లిపోగా.. చిరు రెస్పాన్స్ ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక లింగుస్వామితో అనౌన్స్ చేసిన బైలింగ్యువల్ ను.. ప్రస్తుతానికి బన్నీ పక్కన పెట్టేసినట్లే తెలుస్తోంది.
{youtube}v=kY0FIWGGLaw{/youtube}
Related