టాలీవుడ్ లో ప్రేమ కథలను తెరకెక్కించడంలో సుకుమార్ దిట్ట అన్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కోరిక ను సుకుమార్ తీర్చలేకపోతున్నాడు. గత పదేళ్లుగా దేవి శ్రీ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వాడానికి చూస్తున్నాడు.
సంగీతం పై ఎంత ప్రేమ పెడతాడో తన ఫిజిక్ మీద కూడా అంతే ఫోకస్ పెడతాడు. ఆ మధ్య అశ్వనీదత్ దేవి తో సినిమా అని ప్రకటించాడు కానీ అది సెట్స్ ఫైకి వెళ్లలేకపోయింది. కుమారి 21 ఎఫ్ సినిమా సమయంలో సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నాని ప్రకటించాడు.
కానీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ ఫైకి పెళ్లలేదు కానీ, దాని ఊసు చెప్పడమే మానేశారు. ప్రస్తుతం సుకుమార్.. రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దేవి తో చేస్తాడని అంటున్నారు. మరి సుకుమార్ దేవి కోరిక తీరుస్తాడో లేదో చూడాలి. సినీ ప్రేక్షకులు మాత్రం దేవి హీరోగా చేయకున్న తన మ్యూజిక్ తో హీరో అనిపించుకున్నాడని అంటున్నారు.
Related