Sunday, May 5, 2024
- Advertisement -

‘భాగమతి’ ద‌ర్శ‌కుడు భిన్న‌మైన‌ సినిమా

- Advertisement -

అనుష్క‌తో చేసిన సినిమా సూప‌ర్ హిట్ట‌వ‌డంతో ద‌ర్శ‌కుడు అశోక్ త‌న త‌దుప‌రి సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు. త‌న త‌ర్వాతి సినిమాను రొటీన్‌కు భిన్నంగా ఓ భిన్న‌మైన సినిమాతో వ‌చ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ‘పిల్ల జమిందార్‌’తో ప్ర‌త్యేక‌త చాటిన అశోక్ తాను తీసిన ‘ఆకాశ రామ‌న్న‌, సుకుమారుడు, చిత్రాంగ‌ద‌’ సినిమా మాదిరి కాకుండా ఢిపరెంట్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ సినిమాను సీనియ‌ర్ న‌టుడు ద‌గ్గుబాటి వెంకటేశ్‌తో తీయాల‌ని ప్లాన్‌.

యాక్చువ‌ల్‌గా ఈ సినిమా క‌థ‌ను పిల్ల జ‌మీందార్ స‌మ‌యంలోనే వెంక‌టేశ్‌కు వినిపించారు. ఈ సినిమా అప్పుడే ఓకే అనుకున్న సమయంలో ఎందుకో త‌ప్పిపోయింది. ఇప్ప‌టికీ అశోక్‌కు కుద‌ర‌డంతో సినిమాను తీసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ క‌థ‌ను కేవ‌లం వెంక‌టేశ్ కోస‌మే రాశ‌డంట‌. తీస్తే వెంక‌టేశ్‌తోనే తీయాల‌ని అశోక్ ప‌ట్టుకుని కూర్చున్నారు. ఇంత‌కు క‌థ ఏమిటంటే మూకీ క‌థ‌తో తీస్తున్నారు. అది మూకీ కథ. ఆ సినిమాలో ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు అని స‌మాచారం. ప్ర‌స్తుతం ‘భాగమతి’ విజయం పొంద‌డంతో అశోక్‌తో వెంకటేశ్‌తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -