Friday, April 19, 2024
- Advertisement -

వీలైనంత వరకు మాంసం తగ్గించండి అంటున్న.. స్టార్ హీరోయిన్?

- Advertisement -

అక్కినేని వారి కోడలు హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతూనే పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును తెచ్చుకుంది. మనకు ఆహారం విలువ తెలియాలంటే ఇంట్లోనే పంటలు పండించాలని ‘గ్రో విత్‌ మీ’ పేరుతో సమంత ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసింది. అలాగే సమంత టెర్రస్ గార్డెనింగ్ తో పాటు హైడ్రోపోనిక్ పద్ధతులు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు ఇంట్లోనే పండిస్తోంది.

Also read:వామ్మో ..ప్రభాస్ ఆది పురుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే!

తాజాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో) హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం వర్చ్యువల్‌ సదస్సు నిర్వహించింది. ఇందులో భాగంగా పర్యావరణాన్ని పునరుద్ధరించండి అనే నేపథ్యంతో నిర్వహించిన ఈ సదస్సులో హీరోయిన్ సమంతతో పాటు నారాయణ్‌పేట కలెక్టర్‌ మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో సమంత మాట్లాడుతూ మాంసాహారం సాధ్యమైనంతవరకు తగ్గించుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే కొనండి. అలాగే మీ ఆహారాన్ని మీరే ఇంట్లోనే స్వచ్ఛంగా పండించుకుని తినడం మంచిది. అలాగే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపైనా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

Also read:ఆ సినిమా తర్వాత మరోసారి జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా?

ప్రస్తుతం సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -