Thursday, April 25, 2024
- Advertisement -

రూమర్లకు ఒక్క ప్రోమోతో చెక్ పెట్టిన.. ఎవరు మీలో కోటీశ్వరుడు?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జెమిని టీవీలో ప్రసారం కానున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” ద్వారా బుల్లితెర పై సందడి చేయబోతున్నారనే విషయం తెలిసింది.ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమోతో నందమూరి అభిమానం సర్ ప్రైజ్ చేసారు.”ఇక్కడ కథ మీది కల మీది.. జీవితాన్ని మారుద్దాం రా.. ఆట నాది కోటి మీది రండి గెలుద్దాం”అంటూ ఎన్టీఆర్ జెమినీ టీవీ లో సందడి చేశాడు. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి టెలికాస్ట్ చేసేలా ప్లాన్ చేశారు షో మేకర్స్ . అయితే ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ప్రారంభం కావడంతో షో ని వాయిదా వేయక తప్పలేదట.

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కరోనా ఉధృతి తగ్గగానే ఇంతకు ముందు కమిటైన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటాడు. కాబట్టి ఈ షో ఈ ఏడాది ఉండదనే సంకేతాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా జెమిని టీవీ యాజమాన్యం ఓ ప్రోమో వదిలి రూమర్లకు చెక్‌ పెట్టింది. “ఎవరు మీలో కోటీశ్వరులు” ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. అలాగే చూస్తున్న వారికి వంద శాతం వినోదాన్ని అందజేస్తుందనే ప్రోమోని విడుదల చేసింది. అయితే ఈ షో ఎప్పటినుంచి మొదలవుతుంది. అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.

Also read:పర్యావరణ దినోత్సవంగా మొక్కను నాటిన స్టైలిష్ స్టార్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ “ఆర్ఆర్ఆర్” లో స్వాతంత్ర్య సమరయోధుడు కొమురం భీమ్‌ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు.

Also read:వారి వల్ల నాకు అవకాశాలు తగ్గలేదు: నటి అంజలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -