‘కుమారి 21 ఎఫ్’ హీరోయిన్ ఎంత బోల్డ్ గా మాట్లాడుతుందో చాలా సార్లు చూసాం. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని చెప్పింది. అతను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని కూడా చెప్పింది. ఆయన వల్లే తాను హీరోయిన్ గా మంచి స్థానంలో ఉన్నాని.. తనతో తన బంధం గురించి తన ఫ్యామిలీకి కూడా తెలుసని తెలిపింది.
కానీ ఆ రిలేషన్ ఎంతో కాలం నిలవలేదని చెప్పింది. మరోవైపు రాజ్ తరుణ్ తో ఎఫైర్ పై కూడా ఈ భామ స్పందించింది. రాజ్ తరుణ్ తో తానకు ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. ‘ఈడోరకం ఆడోరకం’ గుమ్మడికాయ వేడుకలో.. తాను రాజ్ తరుణ్ తో ర్యాంప్ వాక్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో మా మధ్య బ్రేకప్ జరిగిందని అనుకున్నారు. నిజానికి ఆ టైంలో నేను దర్శకుడు రవిబాబుతో మాట్లాడుతూ ఉండటం వల్ల ర్యాంప్ వాక్ చేయలేకపోయానని తెలిపింది.
ఐతే రాజ్ తరుణ్ తో మళ్లీ ఇంకో సినిమా చేయడానికి రెడీ అవగానే మా మధ్య ప్యాచప్ అయిపోయిందని రాశారు. మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమాలు హిట్ అవ్వడం వల్ల దర్శక నిర్మాతలు మాతో మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తున్నారు. అంతే కానీ మా మధ్య ఏం లేదని తెలిపింది. రాజ్ తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని.. నేను వ్యక్తిగత జీవితంలో సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తితో డేటింగ్ చేశాను.. ఆ బంధం కొంత కాలమే సాగింది. తాను ఈ స్థాయికి రావడానికి కారణం అతనేనని.. కాకపోతే.. ఆ రిలేషన్ ఎంతో కాలం సాగలేదు అని చెప్పింది.
Related