శ్రీనివాస రెడ్డి కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు హీరో అయ్యాడు. గీతాంజలి చిత్రంతో హిట్ అందుకున్న శ్రీనివాస రెడ్డి తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో కూడా మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్తో తనకు ఉన్న విబేధాల గురించి చెప్పాడు శ్రీనివాస్రెడ్డి. ఎన్టీఆర్ తనకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అని చెప్పిన శ్రీనివాస్రెడ్డి, తాను ఎన్టీఆర్, రాజీవ్ కనకాల కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్లం అని చెప్పాడు.
2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నప్పుడు రెడ్డి రాజీవ్ కనకాల, సమీర్, రఘుతో కలిసి ఓకే బ్యాచ్లో ఉన్నారట. ఖమ్మంలో సభ తర్వాత శ్రీనివాస్రెడ్డి ఈ గ్యాంగ్తో జాయిన్ అయ్యాడట. తర్వాత వారంతా హైదరాబాద్కు కారులో వస్తుండగా సూర్యాపేట సమీపంలో ఎన్టీఆర్ కార్కు యాక్సిడెంట్ అయింది. కింద పడిన ఎన్టీఆర్ బాగా దుమ్ముపట్టిన బట్టలతో గుర్తుపట్టడానికి వీళ్లేకుండా ఉన్నాడు… అదేంటన్నా ఇలా ఉన్నావ్ అంటే.. బ్లడ్ వస్తోంది అంటూ తల భాగం చూపించారు.
వెంటనే నా బ్యాగ్లో టవల్ ఉంటే తలకు చుట్టేసి మా కార్లో ఎక్కించాం. సూర్యాపేటలో ఫస్ట్ ఎయిడ్ చేసి..కిమ్స్కు తరలించామని శ్రీనివాస్రెడ్డి చెప్పాడు. ఈ ప్రాసెస్లో పక్కనే ఉన్న ఓ స్నేహితుడు ‘నువ్వు అడుగు పెట్టావు. యాక్సిడెంట్ అయింది అన్నాడు’. నాకు చాలా బాధనిపించి వెంటనే రిటార్ట్ ఇచ్చాను. ‘నేను ఉన్నాను కాబట్టే ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఇంకేమయ్యేదో’ అని అన్నాను. అయితే వాళ్లు దానిని మరోలా ఎన్టీఆర్ కు చెప్పి ఉంటారు.. అందుకే మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది. ఏదో ఒక రోజు ఎన్టీఆర్ ను కలిసి ఈ గ్యాప్ను తగ్గిస్తానని శ్రీనివాస్రెడ్డి చెప్పారు.
Related