Saturday, May 4, 2024
- Advertisement -

బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్​ మూవీ..!

- Advertisement -

తమిళ సంచలన దర్శకుడు అట్లీ కుమార్​తో ఎన్టీఆర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్​లో నటించబోతున్నట్టు టాక్​. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందట. అట్లీ తమిళనాట ప్రముఖ దర్శకుడు.. రాజారాణి, అదిరింది వంటి ఎన్నో బ్లాక్​బ్లాస్టర్​ చిత్రాలను తెరకెక్కించాడు.

నిజానికి అట్లీతో తారక్​ సినిమా చాలారోజుల క్రితమే ఉండాల్సింది. కానీ వివిధ కారణాలతో మొదలు కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్​ ఆర్​ఆర్​ఆర్​లో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత.. కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత సినిమాను తారక్​ 31ని ప్రశాంత్​ నీల్​ డైరెక్ట్​ చేయబోతున్నాడు. ఆ తర్వాత అట్లీ సినిమా ఉంటుందని సమాచారం.అయితే తారక్​ త్రివ్రిక్రమ్​తో ఓ సినిమా చేయాల్సింది ఉంది.. కానీ ప్రస్తుతం అది ఇప్పట్లో ట్రాక్​ మీదకు వచ్చే అవకాశం లేదు.

ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ఓ మూవీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇది పూర్తికాగానే ఎన్టీఆర్​ కొత్త ప్రాజెక్టుకు రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుతుండటంతో షూటింగ్ లు ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఆర్​ఆర్​ఆర్​ ఇప్పటికే 70 శాతం షూటింగ్​ పూర్తి చేసుకున్నది. మిగతా షూటింగ్​ ముగిసిన వెంబడే.. తారక్​ తర్వాతి సినిమాతో బిజీ కాబోతున్నాడు. అట్లీ-తారక్​ సినిమా కాంబినేషన్ పై నందమూరి అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.

Also Read

తారక్​ మూవీలో విజయ్​ సేతుపతి..! ఏ క్యారెక్టర్​ అంటే?

టక్​ జగదీశ్​ విడుదలకు అడ్డంకులు తొలగినట్టేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -