తమిళ సంచలన దర్శకుడు అట్లీ కుమార్తో ఎన్టీఆర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్లో నటించబోతున్నట్టు టాక్. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందట. అట్లీ తమిళనాట ప్రముఖ దర్శకుడు.. రాజారాణి, అదిరింది వంటి ఎన్నో బ్లాక్బ్లాస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు.
నిజానికి అట్లీతో తారక్ సినిమా చాలారోజుల క్రితమే ఉండాల్సింది. కానీ వివిధ కారణాలతో మొదలు కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత.. కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత సినిమాను తారక్ 31ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత అట్లీ సినిమా ఉంటుందని సమాచారం.అయితే తారక్ త్రివ్రిక్రమ్తో ఓ సినిమా చేయాల్సింది ఉంది.. కానీ ప్రస్తుతం అది ఇప్పట్లో ట్రాక్ మీదకు వచ్చే అవకాశం లేదు.
ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ఓ మూవీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇది పూర్తికాగానే ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టుకు రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుతుండటంతో షూటింగ్ లు ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నది. మిగతా షూటింగ్ ముగిసిన వెంబడే.. తారక్ తర్వాతి సినిమాతో బిజీ కాబోతున్నాడు. అట్లీ-తారక్ సినిమా కాంబినేషన్ పై నందమూరి అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.
Also Read