కరోనా ఎఫెక్ట్తో పెద్ద హీరోలకంటే .. చిన్న హీరోలే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాలు ఎలాగూ చాలా కాలం పాటు చిత్రీకరిస్తారు. సంవత్సరానికి ఓ మూవీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా టైంలో చిన్న హీరోల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే కొందరు హీరోలు ఓటీటీల బాటపడ్డారు. కానీ నేచురల్ స్టార్ నాని.. సినిమాలు సంవత్సరానికి రెండు లేదా మూడు విడుదలవుతూ ఉంటాయి.
గత ఏడాది కరోనా ఎఫెక్ట్తో ఆయన నటించిన ఒక్కసినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ఇక వీ చిత్రం ఓటీటీలో రిలీజ్ చేశారు. అది అంతగా అలరించలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నానీ నటించిన టక్ జగదీశ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ కరోనాతో బ్రేక్ పడింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్నది.
ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో థియేటర్లు కూడా తెరిచే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జూలై ఆఖరులో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Also Read
బన్నీ అస్సలు తగ్గేటట్టు లేడుగా..!