రాజమౌళి మూడు ఏళ్లు గా కష్టపడి తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. ఈ సినిమా మొదటి భాగంలో బాహుబలిని చంపించి అతని రాజ్యాన్ని అక్రమంగా ఆక్రమించి పాలిస్తుంటాఅడు బాహుబలి సోదరుడు భళ్లాలదేవుడు. ఇక ఇప్పుడు రాబోతున్నబాహుబలి రెండో పార్ట్ లో భళ్లాలదేవుడిని బాహుబలి కొడుకు శివుడు ఎలా అంతమొందించి మహిష్మతి రాజ్యాన్ని తిరిగి ఎలా సొంతం చేసుకున్నాడు అనేది మిగిత కథ.
అయితే ఈ సినిమాని తెరకెక్కించిన రాహమౌళి.. బాహుబలి 2 తోనే ఈ ఆపడానికి ఇష్టపడటం లేదు. బాహుబలి సీరిస్ను రాజమౌళి కేవలం బాహుబలి 2తో మాత్రమే వదిలేయకుండా దీనిని ఇలాగే కొనసాగించే ఉద్దేశంలో ఉన్నాడు. ఇదే విషయాన్ని బాహుబలి స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన ఈ సీరిస్లో వచ్చే సినిమాల్లో కొత్త హీరోలు నటిస్తాడని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలోనే బాహుబలి-3 సినిమాలో కొత్త హీరోలు నటిస్తారని తెలుస్తోంది.
బాహుబలి సీరీస్ కు ఇండియా వైజ్గా సూపర్ క్రేజ్ తెచ్చేందుకు దీన్ని ధూమ్ సీరిస్ సినిమాల కంటే స్ట్రాంగ్ గా మార్చే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి బాహుబలి నెక్ట్స్ సీరిస్ సినిమాల కోసం అమీర్ ఖాన్, సూర్య, ఎన్టీఆర్లాంటి వాళ్ళతో రాజమౌళి టచ్లో ఉన్నాడని తెలుస్తోంది. ఇక బాహుబలి-3 లో ఎన్టీఆర్ రాజు గా నటిస్తున్నాడని ముందుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే బాహుబలి-3 ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
{youtube}R_rxMytXkEM{/youtube}
Related