Friday, May 3, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!

- Advertisement -

సినీ రంగంలో పోటీ అనేది తప్పనిసరి అని చెప్పోచ్చు. అయితే ఈ పోటీ వల్ల కొన్నిసార్లు సక్సెస్ వస్తే.. మరి కొన్ని సార్లు పరువును తీస్తుంది. రెండోది ఇప్పుడు స్టైలీష్ స్టార్ బన్నీ విషయంలో జరిగింది. సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఈ తరం హీరోలో నంబర్ వన్ గా అనిపించుకున్నాడు బన్నీ.

తన సినిమా కలెక్షన్లను మరే సినిమా దాటలేదని అనందంగా ఉన్న బన్నీకి ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఊహించని షాక్ ఇచ్చిందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం, మలయాళం లోను మంచి వసూళ్లు రాబట్టడం చూసి బన్నీ ఆశ్చర్య పోయారని వెల్లడించింది. అంతే కాకుండా హడావిడిగా లింగు స్వామితో సినిమా మొదలు పెట్టడానికి కారణం కూడా యంగ్ టైగరే అని రాసింది. అదెలా అంటే.. కొద్ది రోజుల క్రితం తమిళ డైరెక్టర్ లింగు స్వామి అల్లు అర్జున్ కి కథ చెప్పాడు.

ఆ స్టోరీ నచ్చిన వెంటనే ఒకే చెప్పకుండా బన్నీ హోల్డ్ లో పెట్టాడు. ఆ దర్శకుడికి ఏం చెప్పకుండా  హరీష్ శంకర్ తో దువ్వాడ జగన్నాధం చిత్రం చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో లింగు స్వామి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి అదే కథను చెప్పాడు. తారక్ కి ఆ కథ నచ్చిందని, ఒకే చెప్పేలా ఉన్నాడనే వార్త బన్నీ చెవిన పడగానే, వెంటనే లింగు స్వామిని పిలిచి అదే సినిమా చేస్తానని చెప్పడమే కాకుండా, ఆ కథ మళ్లీ ఎన్టీఆర్ కి వెళుతుందని భయపడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు చెన్నై పత్రికలు కథనాలు వెలువరించాయి. వచ్చే ఏడాది నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం కోసం ఇప్పుడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చూస్తుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ బయపడినట్లే అనిపిస్తోంది.

Related

  1. ఎన్టీఆర్‌ ని వదిలి బన్నీ కోసం వచ్చాడు
  2. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం!
  3. అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథం స్టోరీ లీక్!
  4. అల్లు అర్జున్ పట్టించుకోకున్నా విష్ చేసిన జక్కన్న

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -