యంగ్టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి సినిమా కోసం అమెరికా వెళ్లాడు.అక్కడ రకారకాల ఫోటోషుట్ కోసం చరణ్,ఎన్టీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే.కాని ఎన్టీఆర్కు ఓ పక్షన్ కాల్ వచ్చింది.ఆర్జెంట్గా ఇండియాకు రావలని ఆ ఫోన్ కాల్ సారాంశం.దీనితో యంగ్టైగర్ ఎన్టీఆర్ అమెరికా నుండి ఇండియాకు బయలుదేరాడు.ఇంతకీ దేని కోసం ఎన్టీఆర్ ఇండియా వస్తున్నాడు అనే కదా! మీ డౌట్…. ఏం లేదండీ అన్న కళ్యాణ్ రాం కోసం ఇండియాకు బయలుదేరాడు ఎన్టీఆర్.
కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు చిత్రాలతో నటిస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో చిత్రం నా నువ్వే. ఈ చిత్రం జయేంద్ర దర్శకత్వం లో రూపొందుతోంది. తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఎమ్మెల్యే చిత్రం గురించి అంతటా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.ఈ చిత్ర టీజర్ కూడా ఆకట్టుకుంది.
చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్, స్టిల్స్ ని పరిశీలిస్తే కాజల్, కళ్యాణ్ రామ్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. ఈ చిత్ర ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఆడియో వేడుక కోసం హైదరాబాద్ తిరిగి వస్తున్నాడని సమాచారం. అన్న కోసం తమ్ముడు అమెరికా నుండి ఇండియాకు రావడం చూస్తే వీరి మధ్య బంధం ఎంత గట్టిగా ఉందో తెలుస్తుంది.