Monday, April 29, 2024
- Advertisement -

థ్రిల్లింగ్‌ కథతో చేయడానికి సిద్ధమైన చందమామ!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా తన జోరును ఏ మాత్రం తగ్గించడం లేదు. ఇప్పటివరకు ఎన్నో విభిన్న కథా చిత్రాలలో నటించిన కాజల్ అగర్వాల్ తాజాగా మరొక థ్రిల్లింగ్‌ కథతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా తాజాగా లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ ద్వారా సందడి చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరో మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.

పేపర్ బాయ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు జయశంకర్ కాజల్ అగర్వాల్ కి కథ వినిపించగా.. కథ నచ్చడంతో ఈ సినిమా చేయడం కోసం చందమామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే జయశంకర్ ఓటీటీలో ‘విటమిన్‌ – షీ’ సినిమాతో ఆకట్టుకున్నారు. తాజాగా జయశంకర్ చెప్పిన కథకు కాజల్ అగర్వాల్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో స్క్రిప్టుకు మెరుగులు దిద్దుకున్నాడు.

Also read:నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

లేడి ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందనే సమాచారం కూడా వినిపిస్తుంది.అయితే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలను కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో చిరంజీవి సరసన “ఆచార్య” సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ నాగార్జునతో కూడా ఓ సినిమా చేయనుంది. అదే విధంగా తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Also read:ఆది పురుష్ చిత్రంలోని కీలక పాత్ర పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -