- Advertisement -
దర్శకనిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న.. ఏదో ఒక విధంగా లీక్ వీరులు మాత్రం తమ బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటలకే నెట్ లో సినిమాను పెట్టడం అటుంచితే.. ఇప్పుడు ఇంకా రిలీజ్ కానీ సినిమాలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు ను కూడా రిలీజ్ రోజు కొంతమంది మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలలో అప్ లోడ్ చేసారు. దీనిపై స్పందించిన నిర్మాత శరత్ మరార్, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, వీడియోను లీక్ చేసిన వారిని గుర్తించడానికి చిత్ర బృందం ప్రత్యేకంగా దర్యాప్తు జరిపిస్తోంది.
{youtube}5g-sT75d7K0{/youtube}
Related