పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా.. కాటమరాయుడు. ఈ సినిమాకి డాలీ దర్శకత్వం వహిస్తుండగా.. పవన్ సరసన ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కాటమరాయుడు సినిమాపై రోజుకో నెగిటివ్ వార్త వచ్చి పడుతోంది. పవన్ సినిమాలన్నీ రిలీజ్కు ముందు వరకు ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటున్నాయి. పవన్ కేరీర్లోనే తిరుగులేని బ్లాక్బస్టర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా సైతం రిలీజ్కు ముందే లీక్ అయ్యి ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది.
ఇక కాటమరాయుడు సంగతికి వస్తే.. ఈ చిత్రంకు డైరెక్టర్ గా ఎస్జే సూర్యను అనుకున్న.. కొన్ని కారణాల వల్ల ఎస్జే సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. షూటింగ్ వాయిదా పడుతూ రావడం, దర్శకుడు డాలీతో గొడవపడి పవన్ సెట్ నుంచి వెళ్లిపోవడం.. హీరోయిన్ శృతి కాల్షీట్లు వాడుకోకపోవడంతో ఆమె తప్పుకుంటుందని ఇలా ఏదో ఒక నెగిటివ్ న్యూస్ ఈ సినిమా గురించి వెలువడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే దీపావళికి రిలీజ్ అయిన కాటమరాయుడు పోస్టర్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి.
ఈ సినిమా కోలీవుడ్లో హిట్ అయిన అజిత్ మూవీ వీరమ్కు అనధికారిక రీమేక్. అక్కడ అజిత్-తమన్నా జంటగా నటించారు. బయటకు చెప్పకపోయినా ఆ సినిమానే పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తాజాగా దీపావళిని పురష్కరించుకుని ‘కాటమరాయుడు’ పస్ట్లుక్ను విడుదల చేశారు. ఇది అచ్చంగా తమిళ ‘వీరమ్’ పోస్టర్కు కాపీగానే ఉంది. దాంతో విమర్శలు మొదలయ్యాయి. ఎంత రీమేక్ అయితే పోస్టర్ దగ్గర్నుంచి కాపీయేనా అని కామెంట్స్ వినబడుతున్నాయి.
Related