Friday, May 17, 2024
- Advertisement -

ఆ రోజాంతా సల్మాన్ గ‌దిలోనే ఈ హీరోయిన్‌…

- Advertisement -

సల్మాన్ జైలు నుండి విడుద‌ల అయిన త‌రువాత త‌న ఇంటికి బాలీవుడ్ మొత్తం ప‌రామ‌ర్శ‌కు బ‌య‌లుదేరింది.ఇందులో ప్ర‌తేక్యంగా హీరోయిన్ క‌త్రినాకైఫ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకొవాలి.ఎందుకంటే స‌ల్మాన్ జైలుకు వెళ్ల‌క ముందే ముంబయిలో ప్రత్యేక పూజలు చేసింది క‌త్రినా.ఆమె పూజా ఫలమో… ఏమో కాని మొత్త‌నికి స‌ల్మాన్ బెయిల్‌పై విడుద‌ల అయ్యాడు.ఈ హీరో విడుదలయ్యాడని తెలిసిన వెంటనే అతడి నివాసానికి చేరుకుంది. అప్పట్నుంచి అతడితోనే ఉంటోంది.సల్మాన్ ఖాన్ ను పరామర్శించేందుకు బాలీవుడ్ అంతా క్యూ కట్టింది. వరుణ్ ధావన్, జాక్వెలిన్, కరణ్ జోహార్, ప్రీతి జింటా, బాబి డియోల్, సానియా మీర్జా, ప్రభుదేవా.. ఇలా ఎంతోమంది సల్మాన్ ను పరామర్శించి వెళ్తున్నారు.

కత్రినాకైఫ్ మాత్రం సల్మాన్ తో పాటు అతడి ఇంట్లోనే ఉండిపోయింది.సల్మాన్, కత్రిన ఒకప్పుడు ప్రేమించుకొని విడిపోయారు. కాని తాజా ప‌రిస్థితుల దృష్ట్య స‌ల్మాన్ విడిచి ఉండ‌లేక‌పొతుంద‌ట క‌త్రినా.మ‌ళ్లీ వీరిద్ద‌రు ద‌గ్గ‌ర అయినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.సల్మాన్ కూడా క‌త్రినా లేక‌పొతే ఉండ‌లేక‌పోతున్నాడ‌ని స‌మాచారం.సల్మాన్ తో గడిపేందుకు ప్రస్తుతం చేస్తున్న జీరో అనే సినిమా షూటింగ్ ను కూడా కత్రినాకైఫ్ రద్దుచేసుకుందని తెలుస్తుంది.మొత్త‌నికి వీళ్లు మళ్లీ ప్రేమ‌లో మునిగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -