Thursday, May 2, 2024
- Advertisement -

కేజిఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. అసలు నిజం?

- Advertisement -

కన్నడ నటుడు యశ్ హీరోగా వివిధ భాషలలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కి దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. కేజిఎఫ్ లాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తన దృష్టిని మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మళ్ళించారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోలతో వరుసగా పా ఇండియా చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం కరోనా కారణం వల్ల వాయిదా పడింది. ఈ చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మరో చిత్రాన్ని చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో స్టార్ హీరోతో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also read:క్రేజీ ఆఫర్ దక్కించుకున్న కీర్తి సురేష్.. గుడ్ లక్ సఖి?

ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిజం ఎంత ఉంది? ఒకవేళ ఉంటే ఏ జోనర్ లో ఉంటుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే ఈ విషయంపై డైరెక్టర్ స్పందించే వరకు వేచి ఉండాలి.ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ చాప్టర్2 షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Also read:మళ్లీ పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ నోయల్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -