పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా సర్దార్ సినిమా షూటింగ్లో పాల్గొంటు చాలా బిజీగా ఉన్నాడు. పవన్ సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందుస్తున్నాడు.
ఐతే సర్దార్ సినిమా తర్వాత పవన్ ఏ సినిమా చేయబోతున్నాడు ఆ సినిమాని ఎవరు నిర్మించాబోతున్నారు అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటీకే దాసరి నారాయణరావు, దిల్ రాజు, రిసెంట్గా వేదాలం రీమేక్ కోసం సూర్యా మూవీస్ అధినేత అయిన రత్నంకి కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు పవన్.
వీరిలో ఎవరు పవన్తో సినిమా చేస్తారో తెలియాదు కానీ పవన్ మాత్రం మహేష్ బాబుతో శ్రీమంతుడు వటి బ్లాక్ బాస్టర్ సినిమా తీసిన మైత్రి మూవీ మేకర్స్ వారికి మీ బ్యానర్లో వచ్చే ముడో సినిమాని నేను చేస్తా అని చేప్పాడట. ఈ బ్యానర్ దగ్గర నుంచి అడ్వాన్స్ గా 10.5 కోట్ల భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడట.
అలాగే పవన్ డైరెక్ట్ చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా రేమ్యునరేషన్ ఇచ్చారట. ప్రస్తుతం పవన్ మరియు మైత్రి సంస్థ తమ సినిమాలతో బీజీగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ పవన్ తో చేయబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.