మొన్న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పీవీపీ నిర్మాణ సంస్థ విడుదల చేసిన పోస్టర్ ఒకటి సంచలనం సృష్టించింది. మహేష్ బాబు మురగదాస్ తో సినిమా షూటింగ్ మొన్న మొన్ననే మొదలు పెట్టాడు. కానీ అతని తదుపరి సినిమా తమతోనే అంటూ మహేష్ 24 అని రాసుకుని మరీ పీవీపీ సంస్థ సినిమా పోస్టర్ విడుదల చేసేసింది.
ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి అని ప్రకటిస్తూ మహేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది ఈ పోస్టర్. అయితే ఈ పోస్టర్ చూసిన మహేష్ కి పిచ్చ కోపం ఒచ్చింది అంటున్నారు. ఈ పోస్టర్ చూసిన వారు అందరూ మహేష్ తదుపరి చిత్రం వంశీ తోనే అని ఫిక్స్ అయ్యారు.
మీడియా లో కూడా ఇదే కన్ఫారం అనే న్యూస్ వచ్చేసింది కానీ నిజానికి మహేష్ కేవలం పీవీపీ కి డేట్ లు ఇచ్చాడు గానీ డైరెక్టర్ వంశీ అనేది ఇంకా ఫైనల్ చెయ్యలేదట. మరి అలాంటప్పుడు డైరెక్టర్ పేరు ఎందుకు వేసారు అనీ అలాగే తదుపరి చిత్రం డేట్స్ ఇచ్చినట్టు తాను చెప్పలేదు కదా అని సీరియస్ అయ్యి పీవీపీ సంస్థ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు అంటున్నారు.
Related