ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ టాప్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇటివలే ప్రారంభం అయ్యింది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. మురగదాస్, మహేష్ కాంబినేషన్లో ఈ చిత్రం వస్తుడటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీతి సింగ్ నటించబోతుంది అని ఇటివలే చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.
అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. మహేష్ భార్య నమ్రత. అవును ఈ చిత్రంలో నమ్రత సెకండ్ హీరోయిన్ గా నటించబోతుందట. అయితే టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం మేరకు ఈ చిత్రంలో ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ప్లాష్ బ్యాక్ లోనే నమ్రత కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ రోల్ కోసం ముందుగా వేరే హీరోయిన్స్ అనుకున్నాడట మురగదాస్. అయితే ఈ రోల్ నమ్రత చేస్తే బాగుటుందని ఆమెను సంప్రదించడట. రోల్ నచ్చడంతో నమ్రత కూడా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పిందట. మరో సారి మహేష్, నమ్రతను ఒకేసారి తెర మీద చూడాలి అని ఆశపడ్డ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో విలన్ గా ఎస్ జే సూర్య నటిస్తున్నాడు.
Related