Friday, April 26, 2024
- Advertisement -

గతంలోకి వెళ్లిన రవితేజ.. క్రేజి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు?

- Advertisement -

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ఆరంభంలోనే క్రాక్ సినిమాతో అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా “ఖిలాడి” ఈ సినిమాకు రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయన సరసన మీనాక్షి చౌదరి,డింపుల్ హయతి హీరోయిన్లుగా
అలరించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఖిలాడి సినిమా పోస్టర్స్, టీజర్‌కి మంచి స్పందన లభించడంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన ఖిలాడి సినిమా ప్రస్తుతం నెలకొన్న కోవిడ్‌ పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Also read:ఈ నటుడి కథను సినిమా తీస్తే.. పక్క సూపర్ హిట్!

అయితే రవితేజ ఈ ఏడాది మూడో సినిమా కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యాడు.ఈ సినిమాలో రవితేజ ఇంతకుముందు సినిమాల్లో కన్నా విభిన్నంగా కనిపించనున్నాడట.ఈ సినిమా కథ 25 ఏళ్లక్రితం వెనక్కి వెళ్లి నడుస్తుందని అంటున్నారు చిత్ర దర్శకుడు. ఈ సినిమాలో కూడా ఇద్దరు కథానాయికలతో రవితేజ రొమాన్స్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ మొదలైన కార్యక్రమాలు చకచకా పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర మేకర్స్.

Also read:సమంత కొడుకుగా నటించేది ఆ స్టార్ హీరో కొడుకే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -