బాలరామాయణం, ఒక్కడు వంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్. నేటి కథాంశాలతో పాటు చారిత్రాత్మక చిత్రాలు తీయడంలో ఆయనకు పెట్టింది పేరు. ఆ మధ్య కాలంలో అనుష్క, రాానా, అల్లు అర్జున్ కీలక పాత్రమలో ‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలందున్నారు గుణశేఖర్.
ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మరో పౌరాణిక చిత్రం రాబోతోంది. అదే “శాకుంతలం” పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో ఉన్నటు వంటి ఓ ప్రేమకథాంశం అధారంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో శాకుంతల పాత్రలో అందాల నటి సమంత నటిస్తున్నారు. కథానాయకుడు దుష్యంతుడి పాత్రంలో మళయాల నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో మరో కీలక పాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారని సమాచారం. ఈ కథలో అత్యంత కీలకమైన దూర్వాస మహాముని క్యారెక్టర్లో ఆయన నటించనున్నారని తెలిసింది. ఈ పాత్రకు సంబంధించి మోహన్ బాబుతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !
వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!