Friday, March 29, 2024
- Advertisement -

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

- Advertisement -

టాలీవుడ్ లో ఇండస్ట్రీలో వీరిద్దరూ హ్యాట్రిక్ రికార్డును అందుకున్నారు. ఈ ఇద్దరూ తమ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తుండే సినిమాను అందించారు. ఈ ఇద్దరు మరెవరో కాదు.. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా తెరంగేట్రం చేసినా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, వీళ్లు మామూలు వాళ్లు కాదు ‘జాతి రత్నాలు’ అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ అనుదీప్ కేవి.

ఈ ఇద్దరు ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ డైరెక్టర్, ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే వైష్ణవ్ తేజ్ తో అనుదీప్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని సమాచారం. ఇకపోతే డైరెక్టర్ అనుదీప్ తన మొదటి సినిమా జాతి రత్నాలు తో ప్రేక్షకుల్లో మాంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాగే ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ కూడా ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కబోతోందని అర్థమవుతోంది.

కిడ్నీలల్లో రాళ్లా.. అయితే ఇవి అస్సలు తినకండి !

బాగా చెమ‌ట ప‌డుతుందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

నాగార్జున‌కు కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ !‌

ర‌జినీ కాంత్ సినిమాపై క‌రోనా దెబ్బ !

కారును ఢీ కొట్టిన విమానం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -