Sunday, May 19, 2024
- Advertisement -

అఖిల్ పెళ్లి క్యాన్సిల్ త‌ర్వాత నాగ్ మొదటి రిప్లే

- Advertisement -
Nagarjuna First Replay After Akhils First Breakup

అక్కినేని నాగార్జున గత రెండు వారులుగా ఎవరితో మాట్లాడటం లేదు. నాగార్జునకు ఈ రెండు వారాలు కేరీర్ ప‌రంగానే చాలా గ‌డ్డు కాలం అనుకోవాలి. తాను ఎంతో నమ్మకం పెట్టుకున్న ‘ఓం నమో వేంకటేశాయ’ ప్లాప్ గా నిలిచింది. ఆ మూవీ థియేట్రికల్‌ రైట్స్‌ను ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్లకు అమ్మగా.. కనీసం పదికోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది.

ఓం న‌మో వేంక‌టేశాయ సంగ‌తి అలా ఉంటే.. తన చిన్న కొడుకు అఖిల్‌ పెళ్లి రద్దు వ్యవహారం కూడా నాగ్‌ను చాలా బాధపెట్టిదింది. ఈ నెపథ్యంలోనే నాగ్ గ‌త రెండు వారాలుగా మీడియా ముందుకు అస్స‌లు రాలేదు. ఇక ఫ్రెండ్స్‌తో పాటు త‌న‌కు అత్యంత స‌న్నిహితుల‌కు కూడా ఫోన్ ట‌చ్‌లో లేకుండా పోయాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న నాగ్ తన పనులతో బిజీ అవుతున్నాడు.

ప్రస్తుతం నాగ్  ‘రాజుగారి గది-2’ షూటింగ్‌కు హాజరవుతున్నాడు. అక అఖిల్ – శ్రియా బ్రేక‌ప్ త‌ర్వాత ఎట్ట‌కేల‌కు నాగ్ త‌న సోష‌ల్ మీడియాలో ఫ‌స్ట్ టైం స్పందించాడు. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నాగ్ ఇటీవ‌ల అస్స‌లు స్పందించ‌లేదు. ఇక నాగార్జున సోష‌ల్ మీడియాలో ట్విట్ చేసినా అది అఖిల్ మ్యాట‌ర్‌పై మాత్రం కాదు. రాజుగారి గ‌ది-2 షూటింగ్‌ స్పాట్‌లో తీసిన ఫోటోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన నాగ్‌.. ‘బ్యాక్‌ ఇన్‌ బిజినెస్‌ విత్‌ రాజుగారి గది’ అని కామెంట్‌ రాశాడు.

{youtube}H1nkttuRAn4{/youtube}

Related

  1. అఖిల్, శ్రీయాలను కలిపేందుకు.. రంగం లోకి దిగిన ఉపాసన
  2. అఖిల్ పెళ్లి క్యాన్సిల్‌పై నాగర్జున సంచలన వ్యాఖ్యలు!
  3. అఖిల్ ఎందుకు బయపడుతున్నాడో తెలుసా…?
  4. అఖిల్ ఇచ్చిన దెబ్బతో.. నాగార్జున తన ఫోన్ నెంబర్ మార్చేశాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -